హైదరాబాద్లో మాస్కులు ధరించని 41 మందికి జరిమానా
- మాస్కు తప్పనిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వం
- నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా
- వెయ్యి రూపాయల చొప్పున జరిమానా
శేరిలింగంపల్లి జోన్ కమిషనర్ రవికిరణ్ ఆదేశాల మేరకు నిన్న జోన్ పరిధిలోని సర్కిళ్లలో మాస్కులు ధరించని 41 మందికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. శేరిలింగంపల్లి సర్కిల్లో 30 మందికి, చందానగర్ పరిధిలో ఏడుగురికి, యూసఫ్గూడలో నలుగురికి జరిమానాలు విధించినట్టు పోలీసులు తెలిపారు.