Sensex: లాక్ డౌన్ దెబ్బకు మార్కెట్లు కుదేలు... కుప్పకూలిన సెన్సెక్స్!

  • లాక్ డౌన్ ను పొడిగించిన కేంద్రం
  • అమ్మకాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 2,002 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
Sensex crashes after government extends lockdown

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో, వారు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఈ నేపథ్యంటో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,002 పాయింట్లు నష్టపోయి 31,715కి పడిపోయింది. నిఫ్టీ 566 పాయింట్లు కోల్పోయి 9,293కు దిగజారింది. టెలికాం, హెల్త్ కేర్ సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.49%), సన్ ఫార్మా (0.04%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-10.96%), బజాజ్ ఫైనాన్స్ (-10.21%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-10.08%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-9.58%), మారుతి సుజుకి (-8.75%).

More Telugu News