కనికా కపూర్ను ప్రశ్నించిన లక్నో పోలీసులు
- విదేశాల నుంచి వచ్చాక లక్నోలో పాల్గొన్న పార్టీలపై ఆరా
- ఆమె వాంగ్మూలం రికార్డు
- కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ గాయని
కనిక హాజరైన ఓ పార్టీలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుశ్యంత్ సింగ్ సహా పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలపై కనికాను విచారించినట్టు లక్నో సరోజినీ నగర్ ఇన్స్పెక్టర్ ఆనంద్ సాహి తెలిపారు. గాయని పాస్పోర్టు కాపీలు, విమాన టికెట్లు, ఇతర డాక్యుమెంట్లను సేకరించినట్టు చెప్పారు.