rishi kapoor: తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్

  • నిన్న రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురైన రిషి
  • ఆసుపత్రిలో ఆయనకు తోడుగా భార్య నీతూకపూర్
  • కేన్సర్ నుంచి ఇటీవలే కోలుకున్న నటుడు
Rishi Kapoor Admitted to a Hospital in Mumbai

బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ నిన్న రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయనను ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు రణధీర్ కపూర్ వెల్లడించారు. రిషికపూర్‌కు తోడుగా ఆసుపత్రిలో ఆయన భార్య నీతూకపూర్ ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే రిషికపూర్ కుమారుడు రణబీర్ కపూర్ ఆసుపత్రికి చేరుకున్నాడు.

2018లో కేన్సర్ బారినపడిన రిషి కపూర్ ఆ తర్వాత కోలుకున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా రిషికపూర్ యోగా చేస్తున్న ఫొటోను ఇటీవల నీతూకపూర్ ట్వీట్ చేశారు. రిషికపూర్ ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించారు. అంతలోనే ఆయన అనారోగ్యం పాలవడం కుటుంబ సభ్యులను ఆందోళనలోకి నెట్టేసింది.

More Telugu News