sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 484 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

Sensex gains 484 points
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల ప్రభావాలు, క్రూడాయిల్ ధరలు మళ్లీ గాడిన పడుతుండటం వంటిని ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఈ నేపథ్యంలో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 484 పాయింట్లు లాభపడి 31,863కి పెరిగింది. నిఫ్టీ 127 పాయింట్లు పుంజుకుని 9,314కి ఎగబాకింది. ఐటీ, టెక్, బ్యాంకెక్స్ సూచీలు మంచి లాభాలను ఆర్జించాయి

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (8.59%), ఇన్ఫోసిస్ (5.67%), ఐసీఐసీఐ బ్యాంక్ (4.97%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.61%), ఓఎన్జీసీ (2.98%).

టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-4.18%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.59%), ఎన్టీపీసీ (-2.41%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.32%).
Go Back to Shorts
sensex
Nifty
Stock Market

More Telugu News