Sensex: రిలయన్స్-ఫేస్ బుక్ డీల్ తో ఫుల్ జోష్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex ends high amid Facebook buys stake in Reliance Jio
షార్ట్స్‌లో చూడండి
రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ రూ. 43,574 కోట్ల పెట్టుబడి పెట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు జోష్ లో ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 743 పాయింట్లు లాభపడి 31,380కి పెరిగింది. నిఫ్టీ 214 పాయింట్లు పుంజుకుని 9,196 వద్ద స్థిరపడింది. ఎనర్జీ సూచీ ఏకంగా 7.41 శాతం పెరిగింది.

సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (9.91%), ఏసియన్ పెయింట్స్ (5.30%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.93%), నెస్లే ఇండియా (3.57%), మారుతి సుజికి (3.29%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-5.56%), ఎల్ అండ్ టీ (-1.68%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.34%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News