విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఏప్రిల్ 14 తర్వాతే నిర్ణయం: కేంద్రం
- ఏప్రిల్ 14తో ముగియనున్న లాక్ డౌన్
- సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రమంత్రి పొక్రియాల్
- విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్య అంశమని వెల్లడి
విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాల్సి వచ్చినా, విద్యాసంవత్సరం నష్టపోకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని పొక్రియాల్ వెల్లడించారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పెండింగ్ లో ఉన్న పరీక్షల నిర్వహణ, ఇప్పటికే పూర్తయిన పరీక్షల మూల్యాంకనం చేపట్టడంపై ఓ ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు.