Ajay Bhupathi: 'మహాసముద్రం' కోసం నిర్మాతలు రెడీ

  • 'ఆర్ ఎక్స్ 100'తో హిట్ 
  • పట్టాలెక్కని మరో ప్రాజెక్టు 
  • నిర్మాతలను సెట్ చేసిన దర్శకుడు
maha Samudram Movie

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో అజయ్ భూపతి పేరు తెచ్చుకున్నాడు. ఆయనతో యువ కథానాయకుల సినిమాలు వరుసగా వుంటాయని అంతా భావించారు. కానీ ఆ తరువాత సినిమాగా ఆయన అనుకున్న 'మహాసముద్రం' మాత్రం ఇంతవరకూ పట్టాలెక్కలేదు. ఈ కథలో కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎంతవరకూ అంగీకరిస్తారా అనే విషయంలో హీరోలు వెనుకంజ వేస్తున్నారట.

ఈ కారణంగానే రవితేజ .. నాగచైతన్య .. శర్వానంద్ పెద్దగా ఆసక్తిని చూపలేదని తెలుస్తోంది. నిర్మాతలు ఉత్సాహాన్ని చూపించకపోవడానికి కూడా కారణం ఇదేనని అంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి నిర్మాతలు దొరికినట్టు సమాచారం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారని అంటున్నారు. ఇక హీరో దొరికితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యం కాకపోవచ్చునేమో.

More Telugu News