Sensex: మరో భారీ పతనాన్ని చవిచూసిన మార్కెట్లు

  • 1,203 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 344 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 9 శాతానికి పైగా నష్టపోయిన టెక్ మహీంద్రా
Sensex looses more than 1200 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాని ప్రభావం మార్కెట్లపై పడింది. ఇన్వెస్టర్లు తమ వాటాలను అమ్ముకునేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,203 పాయింట్లు నష్టపోయి 28,265కి పడిపోయింది. నిఫ్టీ 344 పాయింట్లు కోల్పోయి 8,254కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హీరో మోటో కార్ప్ (2.21%), బజాజ్ ఆటో (1.12%), బజాజ్ ఫైనాన్స్ (0.40%), టైటాన్ కంపెనీ (0.35%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-9.21%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-8.81%), టీసీఎస్ (-6.23%), ఇన్ఫోసిస్ (-5.65%), యాక్సిస్ బ్యాంక్ (-5.50%).

More Telugu News