Kesineni Nani: కరోనా భయమా.. ఓటమి జ్వరమా?.. ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ అసంతృప్తి: కేశినేని నాని
'కరోనా భయమా.. ఓటమి జ్వరమా..' అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థ ఎన్నికలు 6 వారాల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్లు చేశారు.
'సీన్ రివర్స్ అయ్యింది ...నిన్నటి దాకా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఈ రోజు వైసీపీ, సీఎం జగన్ వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ అసంతృప్తి.. గవర్నర్ హరిచందన్ వద్దకు సీఎం జగన్' అంటూ టీవీల్లో వస్తోందని చెప్పారు.
'సీన్ రివర్స్ అయ్యింది ...నిన్నటి దాకా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఈ రోజు వైసీపీ, సీఎం జగన్ వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ అసంతృప్తి.. గవర్నర్ హరిచందన్ వద్దకు సీఎం జగన్' అంటూ టీవీల్లో వస్తోందని చెప్పారు.