Nara Lokesh: 'నాడు-నేడు' అంటూ జగన్‌పై కార్టూన్‌ పోస్ట్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్‌

  • రూ.12,500ల రైతు భరోసా అన్నారు
  • సున్నావడ్డీ రుణాలు, ఉచితబోర్లు, ఉచిత విద్యుత్ అన్నారు
  • ఇలా అన్నీ కలిపి, ఏడాదికి రైతుకి లక్ష రూపాయలు లబ్ధి అన్నారు
  • విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేని అసమర్థత వైకాపాది
lokesh fires on ycp leaders

'నాడు-నేడు' అంటూ ఓ కార్టూన్‌ పోస్ట్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్‌ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో ఏపీలో రైతులు ఎలా ఉండేవారో, ఇప్పుడు సీఎం జగన్‌ పాలనలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అందులో వివరించారు.
                                                             
'రూ.12,500ల రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, ఉచితబోర్లు, ఉచిత విద్యుత్.. ఇలా అన్నీ కలిపి, ఏడాదికి రైతుకి లక్ష రూపాయలు లబ్ధి అన్నారు. లక్ష మాట దేవుడెరుగు.. కనీసం సమయానికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేని అసమర్థ వైకాపా ప్రభుత్వం 10 నెలల్లో 400మంది రైతుల్ని బలితీసుకుంది' అని తెలిపారు.

More Telugu News