మాచర్ల దాడి ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన
- మాచర్ల ఘటనపై ఈసీ చర్యలను వెల్లడించిన కమిషనర్
- ముగ్గురు వ్యక్తులు దాడి ఘటనలో పాల్గొన్నారని వెల్లడి
- నివేదిక ఆధారంగా వారిని అరెస్ట్ చేశామన్న కమిషనర్
ఘటనపై జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు విచారణ చేపట్టారని వెల్లడించారు. నివేదిక ఆధారంగా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారని రమేశ్ పేర్కొన్నారు. 307, 153 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని వివరించారు. శాంతిభద్రతల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించామని చెప్పారు.