Nani: 'బ్రోచేవారెవరురా' దర్శకుడితో నాని!

  • ఈ నెల 25వ తేదీన రానున్న 'వి'
  • లైన్లో రెండు ప్రాజెక్టులు
  • మైత్రీ బ్యానర్లో మరో మూవీ
Mythri Movie Makers

నాని తాజా చిత్రంగా రూపొందిన 'వి' .. ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాగా 'టక్ జగదీశ్' సెట్స్ పై ఉండగా, ఇటీవలే 'శ్యామ్ సింగ రాయ్' సందడి కూడా మొదలైంది. ఆ తరువాత సినిమాను కూడా నాని లైన్లో పెట్టాడనేది తాజా సమాచారం. ఇటీవల దర్శకుడు వివేక్ ఆత్రేయ వినిపించిన కథకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్టుగా సమాచారం.

గతంలో వివేక్ 'బ్రోచేవారెవరురా' చిత్రాన్ని రూపొందించాడు. పూర్తి వినోదభరితంగా ఆ సినిమాను తెరెకెక్కించిన ఆయన భారీ విజయాన్ని అందుకున్నాడు. అందువలన తదుపరి ప్రాజెక్టుపై అందరిలోను ఆసక్తి వుంది. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ బౌండ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో బిజీగా వున్నాడనీ, ఈ సినిమా కూడా పూర్తి వినోదభరితమైనదిగానే రూపొందుతుందని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

More Telugu News