గోల్డ్ స్కీంలో మోసం చేశారంటూ శిల్పా శెట్టి దంపతులపై ఫిర్యాదు
- గోల్డ్ స్కీంలో కిలో బంగారం కొన్న ఎన్నారై
- గోల్డ్ కార్డు రిడీమ్ చేసుకుంటే మరికొంత బంగారం ఇస్తామన్న కంపెనీ
- కార్డు మార్చుకుందామని వెళ్లిన ఎన్నారైకి తీవ్ర నిరాశ
- షట్టర్ మూసేసిన సంస్థ
అయితే, స్కీం కాలపరిమితి 2019 మార్చి 25తో ముగిసిందని, తన వద్ద ఉన్న గోల్డ్ కార్డ్ మార్చుకునేందుకు ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న సత్యయుగ్ కంపెనీ కార్యాలయానికి వెళితే అక్కడ 'క్లోజ్డ్' బోర్టు కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కంపెనీ గురించి లోతుగా పరిశోధిస్తే, శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరించారని, అయితే 2016, 2017లో వరుసగా తమ పదవులకు రాజీనామా చేసినట్టు తెలిసిందని వివరించారు. దాంతో మోసపోయానన్న భావన కలిగిందని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.