Sensex: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

  • 61 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 18 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా నష్టపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్
Stock Markets ends in green

కరోనా ప్రభావంతో కుదేలవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 61 పాయింట్లు పెరిగి 38,471కి చేరుకుంది. నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 11,269 వద్ద స్థిరపడింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.74%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.17%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.12%), టీసీఎస్ (2.05%), ఏసియన్ పెయింట్స్ (1.38%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.06%), టెక్ మహీంద్రా (-1.70%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.74%), ఇన్ఫోసిస్ (-0.52%), యాక్సిస్ బ్యాంక్ (-0.49%).

More Telugu News