Revanth Reddy: 'ఓటుకు నోటు' కేసు విచారణ... ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్ ‌రెడ్డి

  • తెలుగు రాష్ట్రాల్లో 2015లో సంచలనమైన ఓటుకు నోటు కేసు
  • హాజరైన నిందితులు
  • విచారణ ఈ నెల 17కు వాయిదా
revanth reddy attends in court

తెలుగు రాష్ట్రాల్లో 2015లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ఏ1, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అప్పట్లో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు ఆయన జైలులోనూ ఉన్నారు.

ఈ కేసులో విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఈ రోజు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమ వైపునకు ఆకర్షించేందుకు తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు ఇస్తూ రేవంత్‌ రెడ్డి కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే.

More Telugu News