ముస్లిం రిజర్వేషన్లపై వీహెచ్పీ ట్వీట్ కు శివసేన స్పందన
- విద్యాలయాల్లో ముస్లింలకు కోటా ఇవ్వనున్నట్టు ప్రకటించిన నవాబ్ మాలిక్
- తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన వీహెచ్పీ
- శివసేన నాయకత్వంలోని ప్రభుత్వం వీటికి దూరంగా ఉండాలని సూచన
ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లను కల్పించాలని మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయని... ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని వీహెచ్పీ ట్వీట్ చేసింది. శివసేన నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలకు దూరంగా ఉండాలని వ్యాఖ్యానించింది. దేశంలోని హిందూ సమాజం ఇదే కోరుకుంటోందని చెప్పింది.
వీహెచ్పీ ట్వీట్ పై శివసేన ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఈ అంశంపై ఇంతవరకు ఎలాంటి చర్చ కూడా జరగలేదని స్పష్టం చేసింది.