Stock Market: మార్కెట్ ను వీడిన కరోనా భయం...భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

Stock market in profit mode
షార్ట్స్‌లో చూడండి

చైనాలో మొదలై మరో యాభై ఏడు దేశాలకు విస్తరించిన కరోనా (కోవిడ్ 19) వైరస్ పుణ్యమా అని గత వారం కుదేలైన స్టాక్ మార్కెట్ ఈ వారం ప్రారంభం ఆశాజనకంగా మొదలయ్యింది. ఉదయం 9.45 గంటలకే సెన్సెక్స్ 559 పాయింట్లు, నిఫ్టీ 167 పాయింట్లు లాభపడడంతో మదుపరుల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. 

పదకొండు గంటల సమయానికి  సెన్సెక్స్ 38,865 (+565.52) వద్ద, నిఫ్టీ 11,358 (+156.95) వద్ద కొనసాగుతోంది. కరోనా భయం పుణ్యాన గత వారం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ రోజు ఉదయం దేశీయ మార్కెట్ లాభాలతో మొదలయ్యింది. అయితే కరోనా భయం ఏ మాత్రం తగ్గని పరిస్థితుల్లో ఈ ట్రెండ్ తాత్కాలికమా, శాశ్వతమా? అన్నది సాయంత్రానికి గాని తెలియదు. జీఎంటర్ ట్రైన్మెంట్, ఐసీఐసీఐ, రిలయన్స్, వేదాంత, ఐఓసీ షేర్లు లాభాల్లో ప్రయాణిస్తుండగా, టెక్ మహీంద్రా, కొటక్ మహీంద్ర, ఎంఅండ్ ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

Go Back to Shorts
Stock Market
Sensex
Nifty
high

More Telugu News