జగన్ కు ఎవరూ శత్రువులు లేరు.. ఏపీ ప్రయోజనాలే ముఖ్యం: అంబటి రాంబాబు
- జగన్ ని ముఖేశ్ అంబానీ కలవడం శుభపరిణామం
- టీడీపీ నేతలు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు
- ఏపీలో అంబానీ పెట్టుబడులు పెడితే టీడీపీ నాయకులకు అభ్యంతరమేంటి?
‘ఇంటి వద్దకే పింఛన్లు’ అద్భుత ఫలితాలనిస్తోంది
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అరవై లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరిగిందని, ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిస్తోందని, ఈరోజు ఆదివారం అయినా లబ్ధిదారులకు పింఛన్లు అందాయని అంబటి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడుతూ, అవినీతికి ఆస్కారం లేకుండా పటిష్టమైన వ్యవస్థను జగన్ నిర్మించారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై, రాష్ట్రం నుంచి కియా పరిశ్రమ వెళ్లిపోతోందని, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని చంద్రబాబు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.