అయ్యప్ప మాల ధరించిన విద్యార్థికి స్కూల్లో ప్రవేశం నిరాకరణ!

  • మాల ధరించిన చిన్నారి
  • 16 రోజులుగా లోపలికి అనుమతించని యాజమాన్యం
  • అయ్యప్పస్వాముల నిరసన
ఇది అయ్యప్ప దీక్షల సీజన్ కావడంతో ఓ చిన్నారి కూడా మాల వేసుకున్నాడు. కానీ స్కూలు యాజమాన్యం ఆ బాలుడికి ప్రవేశం నిరాకరించిన ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. భువనగిరి పట్టణానికి చెందిన చిన్నారి కొన్నిరోజుల క్రితం మాల ధారణ చేశాడు. అప్పటి నుంచి ఆ విద్యార్థికి స్కూల్లో ప్రవేశం నిరాకరిస్తున్నారు. రెండు వారాలకు పైగా ఆ చిన్నారిని స్కూలు యాజమాన్యం లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థి తండ్రి శివారెడ్డి ఇదేం అన్యాయం? అని నిలదీశారు. ఇతర అయ్యప్ప స్వాములు కూడా దీనిపై స్పందించి స్కూలు ఎదురుగా నిరసనకు దిగారు.

స్కూలు ప్రిన్సిపాల్ ను వివరణ అడగ్గా, ఇప్పుడే వస్తానని చెప్పిన ఆ ప్రిన్సిపాల్ ఎంతకీ తిరిగిరాలేదు. దాంతో అయ్యప్పస్వాముల్లో సహనం నశించి, స్కూలు ఆఫీసులో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసినా అయ్యప్పస్వాముల ఆగ్రహం చల్లారలేదు. యాజమాన్యం క్షమాపణ చెప్పాల్సిందేనని, విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Ayyappa
Yadadri Bhuvanagiri District
Bhuvanagiri
Principal
School

More Telugu News