ఫడ్నవీస్ బలపరీక్షపై తీర్పును రేపటికి రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు.. వేడెక్కిన 'మహా' రాజకీయం
- రేపు ఉదయం 10.30కి తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు
- రాజ్ భవన్ మెజార్టీని నిరూపించలేదన్న సర్వోన్నత న్యాయస్థానం
- అసెంబ్లీలోనే బలపరీక్ష జరగాలని వ్యాఖ్య
రాజ్ భవన్ మెజార్టీని నిర్ణయించలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం అసెంబ్లీ మాత్రమే మెజార్టీని నిరూపిస్తుందని... శాసనసభలోనే బలపరీక్ష జరగాలని తెలిపింది. ఫడ్నవీస్ ప్రభుత్వానికి అవసరమైనంత సంఖ్యాబలం ఉందా? అని ప్రశ్నించింది. ఫిరాయింపులను అడ్డుకోవాలంటే తక్షణమే బలపరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.