డే/నైట్ టెస్టు: ముగిసిన తొలిరోజు ఆట... టీమిండియాదే ఆధిపత్యం!
- ఆట చివరికి టీమిండియా స్కోరు 3 వికెట్లకు 174 పరుగులు
- రాణించిన కోహ్లీ, పుజారా
- తొలి ఇన్నింగ్స్ లో 106 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 106 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా జట్టును టీమిండియా ఫాస్ట్ బౌలర్లు హడలెత్తించారు. పింక్ బాల్ తో తొలిసారి బౌలింగ్ చేస్తున్నా అద్భుతంగా బంతులు విసిరి బంగ్లా బ్యాట్స్ మెన్ ను ఓ ఆట ఆడుకున్నారు. ఇషాంత్ శర్మ 22 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్ 3, మహ్మద్ షమీ 2 వికెట్లతో రాణించారు. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 68 పరుగులు. టీమిండియా రేపు వీలైనంత ఎక్కువ సమయం బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్ ముందు భారీ స్కోరు నిలిపే అవకాశం ఉంది.