TSRTC: టీఎస్‌ ఆర్టీసీ ఈయూ కార్యాలయంలో కీలక భేటీ : హాజరైన అఖిల పక్షం నాయకులు

షార్ట్స్‌లో చూడండి
టీఎస్‌ ఆర్‌టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో అఖిపక్ష నాయకుల కీలక భేటీ జరిగింది. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిన్న ట్యాంకుబండ్‌పై తలపెట్టిన సర్వజనుల సామూహిక దీక్ష ఉద్రిక్తమైన నేపథ్యంలో ఈ భేటీ జరగడం విశేషం. సమావేశానికి ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామరెడ్దితోపాటు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత భట్టివిక్రమార్క, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వామపక్షాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ట్యాంక్‌బండ్‌పై పరిణామాలు, రేపు హైకోర్టులో వాదనలు, భవిష్యత్ కార్యాచరణ, విపక్షాల మద్దతు సమీకరణ వంటి అంశాలపై నాయకులు కూలంకుషంగా చర్చించారు.
Go Back to Shorts
TSRTC
all party meeting
Hyderabad
EU office

More Telugu News