టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కు స్వల్ప అస్వస్థత!
- చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్
- వెన్నునొప్పితో బాధపడుతున్న శివప్రసాద్
- చెన్నైలోని ‘అపోలో’కు తరలింపు
టీడీపీ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాదరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించినట్టు సమాచారం. గత కొంతకాలంగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు సమాచారం. కాగా, ఏపీలో ఆమధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చిత్తూరు నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ నేత రెడ్డెప్ప చేతిలో ఓడిపోయారు.