Jagan: రేపు ఢిల్లీకి జగన్, కేటీఆర్.. ఇంకా నిర్ణయం తీసుకోని చంద్రబాబు!

షార్ట్స్‌లో చూడండి
'ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు' విషయంపై చర్చించే నిమిత్తం ఢిల్లీలో రేపు మధ్యాహ్నం పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రహ్లాద్ జోషి దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  

దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రేపు వీరిద్దరూ ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం సమావేశానికి హాజరయ్యే విషయమై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
Go Back to Shorts
Jagan
KTR
Chandrababu
Prahlad Joshi
Delhi
Meeting

More Telugu News