paruchuri gopalakrishna: మన రాజేంద్రప్రసాద్ మరో ఎస్వీ రంగారావు: పరుచూరి గోపాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ ను గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "చెన్నైలో మేము నూతన్ ప్రసాద్ గారింట్లో అద్దెకి వున్నప్పుడు, మా ఇంటికి రాజేంద్రప్రసాద్ ఎక్కువగా వచ్చేవాడు. ఆత్మీయతతో మాకు మరింత చేరువైనవారిలో ..  మా ఇంట్లో ఎక్కువసార్లు భోజనం చేసినవారిలో రాజేంద్రప్రసాద్ ఒకరు.

తను ఇప్పటికీ నన్ను 'అన్నాయ్' అనే పిలుస్తుంటాడు. రాజేంద్రప్రసాద్ కామెడీ వైపు వెళ్లకపోతే, మనకి మరో ఎస్వీ రంగారావు ఆయన. నవరసాలను అవలీలగా పలికించగలిగే అతికొద్ది మంది నటుల్లో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. 'ఎర్రమందారం' .. 'ఏప్రిల్ ఒకటి విడుదల' .. 'ఆ నలుగురు' వంటి సినిమాలు అసమానమైన ఆయన నటనకు అద్దం పడతాయి" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
paruchuri gopalakrishna

More Telugu News