Andhra Pradesh: రేపు గుంటూరులో ఇఫ్తార్ విందు.. హాజరుకానున్న ముఖ్యమంత్రి జగన్!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు గుంటూరులో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో రేపు ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందును నిర్వహిస్తోందని చెప్పారు.

ఇందుకోసం వేదికను ఇంకా ఎంపిక చేయలేదన్నారు. వీలైనంత త్వరగా వేదిక ఎంపిక చేసి, ఏర్పాట్లను పూర్తిచేస్తామని శశిధర్ అన్నారు. నిన్న హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు పాల్గొన్నారు. 
Go Back to Shorts
Andhra Pradesh
Guntur District
iftar dinner
Jagan
Chief Minister
YSRCP

More Telugu News