Kurnool District: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

  • వోల్వో బస్సును ఢీకొట్టిన క్రూజర్
  • బైక్‌ను తప్పించబోయి ప్రమాదం
  • పెళ్లి చూపులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలవగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్దుర్తి క్రాస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయిన క్రూజర్, వోల్వో బస్సును ఢీకొట్టింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెళ్లి చూపులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతులంతా గద్వాల జిల్లా పామవరం వాసులుగా పోలీసులు గుర్తించారు. 
Kurnool District
Veldurthi
Volvo Bus
Bike
Gadwal

More Telugu News