ఇది భారత్ 'మిషన్ శక్తి'... యాంటీ-శాటిలైట్ మిసైల్ పరీక్ష విజయవంతమైంది: నరేంద్ర మోదీ కీలక ప్రకటన

  • లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోని లైవ్ శాటిలైట్ కూల్చివేత
  • యాంటీ శాటిలైట్ మిసైల్ ద్వారా ప్రయోగం
  • అమెరికా, రష్యా, చైనాల సరసన ఇండియా
ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సాధించిన మరో ఘనతను ఇండియా కూడా సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన, అంతరిక్షంలో ఓ శాటిలైట్ ను మన శాస్త్రవేత్తలు యాంటీ శాటిలైట్ మిసైల్ ద్వారా కూల్చివేశారని, ఈ ప్రయోగం విజయవంతమైందని, ఇంత టెక్నాలజీని సాధించిన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నానని, ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమని అన్నారు.

లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోని ఈ లైవ్ శాటిలైట్ ను ఏ-శాట్ (యాంటీ శాటిలైట్) మిసైల్ ద్వారా కేవలం మూడు నిమిషాల వ్యవధిలో కూల్చేశారని అన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని, 'మిషన్ శక్తి' పేరిట ఇది జరిగిందని అన్నారు. ఇకపై ఎటువంటి లక్ష్యాన్ని అయినా ఛేదించగల శక్తి ఇండియాకు వచ్చినట్టేనని అన్నారు. స్పేస్ పవర్ దేశాల్లో ఇప్పుడు ఇండియా కూడా చేరిందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.




Go Back to Shorts
Narendra Modi
A-Sat
Space Power

More Telugu News