బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు!
- ఒకేసారి అన్ని రాష్ట్రాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం
- ఏపీకి సంబంధించి లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు
- యూపీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత మొత్తం జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాత అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని, ఈరోజు సాయంత్రం ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.