హైదరాబాద్ లో నడి రోడ్డుపై నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యాపారి!
హైదరాబాద్ నగరంలో ఈ ఉదయం దారుణం జరిగింది. ఉదయాన్నే ఓ వ్యక్తి నడి రోడ్డుపై పెట్రోల్ పోసుకుని సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన సనత్ నగర్ లోని స్నేహపురి కాలనీలో ఉదయం 7 గంటల సమయంలో జరిగింది. తన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వెంకటేష్ గుప్తా అనే వ్యక్తి, ఒంటిపై పెట్రోలు పోసుకుని అంటించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మరణించాడు.
కొన్నేళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న గుప్తా, తీవ్ర నష్టాలు రావడంతో మనస్తాపంతోనే ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఆయన సజీవ దహనమవుతున్న దృశ్యాలు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సజీవ దహనంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కొన్నేళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న గుప్తా, తీవ్ర నష్టాలు రావడంతో మనస్తాపంతోనే ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఆయన సజీవ దహనమవుతున్న దృశ్యాలు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సజీవ దహనంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.