రాకేశ్ రెడ్డికి అసలు బ్యాంకు ఖాతానే లేదట.. బయటపడిన కట్టుకథ
- జయరాంకు రూ.4.17 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్పిన నిందితుడు
- పూర్తిగా అబద్ధమని తేల్చిన పోలీసులు
- నేడు, రేపు మరో ఐదుగురిని విచారించనున్న అధికారులు
అతడికి అసలు బ్యాంకు ఖాతానే లేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఎపిసోడ్లో రాకేశ్ రెడ్డికి సహకరించిన మిగిలిన నిందితులు ఐదుగురిని నేడు, రేపు విచారించనున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులను తొలుత విచారించిన అనంతరం మిగిలిన ముగ్గురినీ విచారించనున్నారు. మరోవైపు, ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రౌడీషీటర్ నగేష్, అతడి అల్లుడు విశాల్లను నిందితుల జాబితాలో చేర్చారు.