Andhra Pradesh: కొందరు వైసీపీ నేతలు త్వరలో టీడీపీలోకి రానున్నారు: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
ఒకరిద్దరు ఎంపీలు వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన టీడీపీకి ఏమీ నష్టం లేదని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు ఆయన పర్యటించారు. మోదీనీ మళ్లీ ప్రధానిని చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కొందరు వైసీపీ నేతలు త్వరలోనే టీడీపీలో చేరనున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.