డాక్యుమెంట్ల కోసం యువతిని ఎరవేశా.. వాటికోసం జయరాం ఇంటికెళ్లా: శిఖా చౌదరి

  • నా పేరున పదెకరాల భూమి కొన్నాడు
  • డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు
  • జయరాం చనిపోయినప్పుడు శ్రీకాంత్‌తో లాంగ్ డ్రైవ్‌లో ఉన్నా
కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు విచారిస్తున్న కొద్దీ మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్యుమెంట్ల కోసం జయరాంకు అమ్మాయిని ఎరవేసిన మాట వాస్తవమేనని, వాటి కోసం ఆయన ఇంటికి వెళ్లిన విషయం కూడా నిజమేనని శిఖా చౌదరి పోలీసుల విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే, జయరాం చనిపోయిన రోజున మాత్రం తాను శ్రీకాంత్ అనే వ్యక్తితో లాంగ్ డ్రైవ్‌లో ఉన్నట్టు పోలీసులకు చెప్పింది.

మామయ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడని తన తల్లి చెబితేనే ఆ విషయం తనకు తెలిసిందని పేర్కొంది. తన పేరున పది ఎకరాల భూమిని కొన్న జయరాం వాటిని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని తెలిపింది. జయరాంను తాను చంపలేదని, కాకపోతే అమ్మాయిని ఎరగా వేయడం మాత్రం నిజమేనని అంగీకరించింది. తన పేరున కొన్న భూమి డాక్యుమెంట్ల కోసమే వారి ఇంటికి వెళ్లానని పేర్కొంది.
Go Back to Shorts
shikha chaudhary
Chigurupat Jayaram
NRI
Srikanth
Express TV

More Telugu News