'దృశ్యం' సినిమా స్ఫూర్తి: యువతిని చంపి, కుక్కను పాతిపెట్టి.. పోలీసులను తప్పుదోవ పట్టించిన తండ్రీ కొడుకులు!
- ఇండోర్ లో ఘటన
- కొడుకులతో కలిసి యువతిని హత్య చేసిన బీజేపీ నేత
- రెండేళ్ల తరువాత నిజం వెలుగులోకి
జగదీశ్ కు ముగ్గురు కుమారులు అజయ్, విజయ్, వినయ్ లకు ఈ విషయం తెలిసింది. తమ తండ్రితో విభేదించిన వీరు, ట్వింకిల్ తో గడిపితే సహించేది లేదని తేల్చి చెప్పారు. కుమారుల ఒత్తిడితో ట్వింకిల్ ను హతమార్చేందుకు జగదీశ్ అంగీకరించి, ప్లాన్ చేశాడు. ఆపై 'దృశ్యం' సినిమా చూసిన వీరంతా, అలాగే ప్లాన్ చేశారు. ట్వింకిల్ ను హత్య చేసి, తగులబెట్టారు.
ఆపై ఓ కుక్కను చంపి పూడ్చి పెట్టారు. కొంతకాలం తరువాత ఎవరినో హత్య చేసి, పూడ్చి పెట్టారన్న పుకారును లేవనెత్తారు. అప్పటికే ట్వింకిల్ అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్ తో రాగా, పూడ్చి పెట్టిన ప్రాంతంలో కుక్క కళేబరం మాత్రమే వారికి కనిపించింది. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి. పోలీసులకు జగదీశ్ తో ట్వింకిల్ కు ఉన్న వివాహేతర బంధం గురించి తెలిసి ఆ దిశగా విచారించగా, వారిలో అనుమానాలు పెరిగాయి. జగదీశే హత్య చేసుండవచ్చన్న వారి అనుమానం నిజమై మిస్టరీ వీడింది. ట్వింకిల్ బ్రేస్ లెట్, ఇతర ఆభరణాలను రికవరీ చేశామని, నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.