తుది అంకానికి చేరిన జగన్ పాదయాత్ర!
- దాదాపు ఏడాదికిపైగా సాగిన పాదయాత్ర
- నేడు తుది నియోజకవర్గమైన ఇచ్చాపురంలోకి
- జనవరి 9 నాటికి పాదయాత్ర ముగింపు!
అదే రోజు జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనే జగన్, ఆ వెంటనే తిరుమలకు వెళ్లి, శ్రీవారి మెట్టు మార్గంలో కొండపైకి చేరుకుని స్వామిని దర్శించుకోనున్నారు. ఆపై సాధ్యమైనంత త్వరగా, పాదయాత్ర మార్గంలో తాను వెళ్లని నియోజకవర్గాల్లో పర్యటించి, అక్కడి ప్రజలను కలవాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇక పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని వైకాపా వర్గాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి.