ముగింపు దశకు జగన్ పాదయాత్ర... పైలాన్ ఖరీదెంతో తెలుసా?
- ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర
- లోద్దపుట్టి తులసమ్మ గుడి ఎదురుగా పైలాన్
- రూ. 50 లక్షలతో నిర్మాణం
- శంకుస్థాపన చేసిన ధర్మాన, భూమా, తమ్మినేని
లొద్దపుట్టి ధనరాజ తులసమ్మ గుడి ఎదురుగా పైలాన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం, మీడియాతో మాట్లాడిన వారు, ఈ ప్రాంతానికి జగన్ చేరుకునే సరికి పైలాన్ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. పాదయాత్ర ముగింపు నాడు భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. స్తూపం నిర్మాణానికి పార్టీ సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి ఆర్థిక సాయం చేస్తున్నారని చెప్పిన ధర్మాన, ఈ సందర్భంగా ఆయన్ను అభినందించారు.