Madhya Pradesh: ఓట్లు అడిగేందుకు ప్రజల వద్దకు వెళ్లిన బీజేపీ అభ్యర్థి.. చెప్పుల దండేసి అవమానం
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన బీజేపీ అభ్యర్థి మెడలో చెప్పుల దండ వేసి అవమానించిన ఘటన మధ్యప్రదేశ్లోని నగడాలో జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం లభిస్తోంది. నగడా-ఖచురాద్ అసెంబ్లీ స్థానం నుంచి దిలీప్ సింగ్ షెఖావత్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఆయనకు నగడాలో చేదు అనుభవం ఎదురైంది.
ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి గ్రామంలో పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు ప్రజలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు కిందికు వంగిన సమయంలో ఓ వ్యక్తి ఆయన మెడలో చెప్పుల దండ వేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పారిపోయేందుకు ప్రయత్నించిన యువకుడిని షెఖావత్ మద్దతుదారులు పట్టుకుని దాడిచేశారు.
ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి గ్రామంలో పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు ప్రజలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు కిందికు వంగిన సమయంలో ఓ వ్యక్తి ఆయన మెడలో చెప్పుల దండ వేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పారిపోయేందుకు ప్రయత్నించిన యువకుడిని షెఖావత్ మద్దతుదారులు పట్టుకుని దాడిచేశారు.