అమృత వర్షిణికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ. 8 లక్షలు!
- అమృతతో మాట్లాడిన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏవీ రంగనాథ్
- ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రయత్నిస్తామని హామీ
- స్కూల్ భవనాన్ని ప్రణయ్ ట్రస్ట్ భవంతిగా మార్చాలని అమృత డిమాండ్
అమృత, ప్రణయ్ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? చదువు మధ్యలోనే ఎందుకు ఆపివేశారు? పెళ్లికి వచ్చిన అభ్యంతరాలు తదితరాంశాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, కేసు విచారణలో ఏ విధమైన సహాయం కావాలో చెప్పాలని అడిగారు. అరెస్టయిన వారికి బెయిల్ రాకుండా చూడాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అమృత కోరడంతో, అందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. తన పేరిట ఉన్న అమృత జీనియస్ స్కూల్ భవనాన్ని ప్రణయ్ ట్రస్ట్ భవంతిగా మార్చాలని, తన తండ్రి ఆస్తులను ట్రస్టుకు చెందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అమృత డిమాండ్ చేసింది.