చూశాము కదా... ఫ్యాన్ మాడి మసైపోయింది: అట్లాంటాలో లోకేష్
- అమెరికాలో పర్యటిస్తున్న నారా లోకేష్
- అట్లాంటాలో ఎన్నారైలతో భేటీ
- 2019 నాటికి పోలవరం ద్వారా నీరు
- ఎన్నికల్లో గెలిచేది టీడీపీయే: లోకేష్
"చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సి వుంది. నాకు అందులో ఎటువంటి సందేహమూ లేదు. మొన్న ఉప ఎన్నికల్లో చూశాము. నంద్యాల్లో చూశాం. కాకినాడలో చూశాం. ఫ్యాన్ మాడి మసైపోయింది. నాకు సందేహం లేదు. నాకు ఎలాంటి సందేహం లేదు. 2019లో కూడా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. కానీ, ఇక్కడున్న ఎన్నారైలను కోరేది ఒక్కటే. ఆంధ్రరాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో భాగం కండి" అని ఆయన అన్నారు. ప్రతి సంక్రాంతికీ స్వదేశానికి వచ్చి, టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలకు మద్దతివ్వాలని కోరారు.