పెద్దావిడకు క్షమాపణలు చెప్పిన ఇండిగో ఎయిర్ లైన్స్.. మళ్లీ అపకీర్తి!
- వీల్ చెయిర్ లో తీసుకెళుతుండగా కిందపడిన ప్రయాణికురాలు
- వెంటనే చికిత్సకు తీసుకెళ్లిన సిబ్బంది
- క్షమాపణలు చెబుతూ ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటన
‘‘నిన్నరాత్రి 8 గంటలకు లక్నో విమానాశ్రయంలో జరిగిన ఈ సంఘటనపై ఊర్వశి పారిఖ్ కు క్షమాపణ తెలుపుతున్నాం. మా ప్రతినిధి ఒకరు అమె వీల్ చైర్ ను వెహికిల్ లేన్ మీదుగా అరైవల్ హాల్ వైపు నడుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రిపూట కావడంతో అక్కడ వెలుతురు సరిగా లేకపోవడానికి తోడు అదే ప్రాంతంలోని తారురోడ్డుపై గుంతపడడం వల్ల వీల్ చైర్ బ్యాలెన్స్ తప్పిపోయింది.
దీంతో ఆమె కిందపడి గాయపడ్డారు. మా సిబ్బంది వెంటనే ఆమెను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైద్యుడి వద్దకు తీసుకెళ్లి వైద్యం అందించారు. ప్రథమ చికిత్స చేసిన తరువాత ఆమె కోలుకున్నారు’’ అంటూ ఇండిగో తెలిపింది. ఈ ఘటనలో మానవ తప్పిదం లేదని ఆమె తెలిపారని ఇండిగో పేర్కొంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని ఇండిగో సంస్థ స్పష్టం చేసింది.