భద్రాద్రిలో కరెన్సీ నోట్లతో గణపయ్య.. అలంకరణకు రూ.1.45 కోట్లు!

భద్రాద్రిలో కరెన్సీ నోట్లతో గణపయ్య.. అలంకరణకు రూ.1.45 కోట్లు!

Ganesha in Bhadradri decorated with currency notes worth 145 Crores
  • భద్రాద్రి జిల్లా పాల్వంచలో గణపయ్యకు భారీ అలంకరణ
  • రూ. 1.45 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకారం
  • వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం
  • మచిలీపట్నంకు చెందిన బృందంతో నోట్ల అలంకరణ
తెలంగాణవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కొలువైన గణపతి విగ్రహం విశేష అలంకరణతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాపూజీ నగర్‌లోని గణనాథుడిని ఏకంగా రూ. 1.45 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు.

వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శుక్రవారం స్వామివారికి ఈ ప్రత్యేక అలంకరణను నిర్వహించారు. వివిధ విలువలు గల కరెన్సీ నోట్లను ఉపయోగించి స్వామివారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో, గణనాథుడు 'ధనలక్ష్మీ గణపతి'గా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన మెహర్ బాబా డెకరేషన్ బృందం తమ నైపుణ్యంతో ఈ అద్భుత అలంకరణను చేపట్టింది.

సుమారు కోటిన్నర రూపాయల విలువైన నోట్లతో ధగధగలాడుతున్న ఈ గణపతిని దర్శించుకునేందుకు పాల్వంచతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ అరుదైన అలంకరణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో కూడిన పండుగ వాతావరణం సంతరించుకుంది.
Advertisement
Ganesha
Bhadradri Kothagudem
Palvancha
Currency note decoration
Ganesh Chaturthi

More Telugu News