సీఎం విజయ్ కీలక నిర్ణయం.. పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం!
- తమిళనాడులో సీఎం విజయ్ ప్రభుత్వం కొత్త పథకం
- ఎన్నికల హామీ మేరకు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు గ్రాము బంగారు ఉంగరం
- 'తైమామన్ తంగ మోతిరం' పేరుతో స్కీమ్ అమలు
- ఉపఎన్నికల నేపథ్యంలో రెండు నియోజకవర్గాల్లో పథకానికి ఈసీ బ్రేక్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి నవజాత శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 6న జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
'తైమామన్ తంగ మోతిరం' (మేనమామ బంగారు ఉంగరం)' పేరిట రూపొందించిన ఈ పథకాన్ని సెప్టెంబర్ 28న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది జూన్ 22వ తేదీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులందరికీ ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన లబ్ధిదారులకు సెప్టెంబర్ 22 నుంచి ఉంగరాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ. 755 కోట్ల బడ్జెట్ను కేటాయించింది.
తమిళనాడు శాశ్వత నివాసితులై ఉండి, PICME పోర్టల్లో RCH ఐడీతో నమోదైన తల్లులకు జన్మించిన శిశువులు ఈ పథకానికి అర్హులు. తొలి దశ అమలు కోసం ఇప్పటికే 1.28 లక్షల బంగారు ఉంగరాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి ఉంగరానికి ఒక ప్రత్యేక సీరియల్ నంబర్ను కేటాయించారు. ప్రాథమికంగా 107 పంపిణీ కేంద్రాల ద్వారా ఈ ఉంగరాలను అందజేస్తారు. భవిష్యత్తులో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలోనే శిశువులకు వీటిని అందించేలా పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
మధురాంతకం, ధరాపురం నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పథకం ప్రకటన వెలువడింది. అయితే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున, ఈ రెండు నియోజకవర్గాల్లో పథకాన్ని ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి నిరాకరించింది. తమిళ సంప్రదాయాలను గౌరవించడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
'తైమామన్ తంగ మోతిరం' (మేనమామ బంగారు ఉంగరం)' పేరిట రూపొందించిన ఈ పథకాన్ని సెప్టెంబర్ 28న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది జూన్ 22వ తేదీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులందరికీ ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన లబ్ధిదారులకు సెప్టెంబర్ 22 నుంచి ఉంగరాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ. 755 కోట్ల బడ్జెట్ను కేటాయించింది.
తమిళనాడు శాశ్వత నివాసితులై ఉండి, PICME పోర్టల్లో RCH ఐడీతో నమోదైన తల్లులకు జన్మించిన శిశువులు ఈ పథకానికి అర్హులు. తొలి దశ అమలు కోసం ఇప్పటికే 1.28 లక్షల బంగారు ఉంగరాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి ఉంగరానికి ఒక ప్రత్యేక సీరియల్ నంబర్ను కేటాయించారు. ప్రాథమికంగా 107 పంపిణీ కేంద్రాల ద్వారా ఈ ఉంగరాలను అందజేస్తారు. భవిష్యత్తులో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలోనే శిశువులకు వీటిని అందించేలా పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
మధురాంతకం, ధరాపురం నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పథకం ప్రకటన వెలువడింది. అయితే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున, ఈ రెండు నియోజకవర్గాల్లో పథకాన్ని ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి నిరాకరించింది. తమిళ సంప్రదాయాలను గౌరవించడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.