బిహార్ సత్తు నుంచి ఒడిశా కాఫీ వరకు.. బ్రిక్స్ అతిథులకు ‘దేశీ’ గిఫ్ట్ బ్యాగ్
- బ్యాగ్లో బిహార్ సత్తు, మఖానా, ఒడిశా అరబికా కాఫీ
- గుజరాత్ బ్లాక్ ప్రింట్ కండువా, బ్యాగ్లోనే ఛార్జింగ్ పోర్ట్
- సుమారు 1,300 మంది జర్నలిస్టుల రాక
- భారత్ మండపంలో ప్రత్యేక మీడియా సెంటర్
అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతి, దేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే జర్నలిస్టులు, ప్రతినిధులకు ప్రత్యేక కానుకల బ్యాగ్ ఇవ్వనుంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది.
ఈ గిఫ్ట్ బ్యాగ్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది రకాల ఉత్పత్తులను ఉంచారు. ఎన్డీటీవీ జర్నలిస్ట్ సిమ్రిన్ గుప్తా ఈ బ్యాగ్ను అన్బాక్సింగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశారు. ‘లోకల్ ఉత్పత్తులకు భారత్ ప్రాధాన్యం ఇస్తోంది’ అంటూ ఆమె బ్యాగ్లో ఉన్న వస్తువులను చూపించారు.
బ్యాగ్లో బిహార్కు చెందిన సత్తు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేయించిన శనగలతో తయారు చేసే సత్తులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బిహార్లో ఎంతో ప్రసిద్ధి. భవిష్యత్తులో పాశ్చాత్య దేశాల్లోనూ సత్తు సూపర్ఫుడ్గా గుర్తింపు పొందొచ్చని గుప్తా పేర్కొన్నారు.
ఒడిశాలోని గిరిజన ప్రాంతాల్లో పండించే 100 శాతం అరబికా స్పెషాలిటీ కాఫీని కూడా బ్యాగ్లో ఉంచారు. దీనితో పాటు బిహార్ మఖానా కూడా ఉంది. భారత్లో ఎంతో ప్రాచుర్యం పొందిన స్నాక్గా మఖానాకు గుర్తింపు ఉంది.
గుజరాత్కు చెందిన బ్లాక్ ప్రింట్ కండువా కూడా ఈ గిఫ్ట్ బ్యాగ్లో ఉంది. వీటితో పాటు కాఫీ మగ్, టోట్ బ్యాగ్ను అందిస్తున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే.. టోట్ బ్యాగ్లోనే ఛార్జింగ్ పోర్ట్ను ఏర్పాటు చేశారు. దీంతో జర్నలిస్టులు ప్రయాణంలోనే తమ ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకోవచ్చు.
బ్రిక్స్ సదస్సు కోసం సుమారు 1,200 నుంచి 1,300 మంది జర్నలిస్టులు ఢిల్లీకి రానున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు. భారత్ మండపంలో ప్రత్యేక అంతర్జాతీయ మీడియా సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జర్నలిస్టులకు సమాచారం అందించడం, సదస్సు కార్యక్రమాల కవరేజీకి ఈ కేంద్రం ఉపయోగపడనుంది.
ప్రస్తుతం బ్రిక్స్లో 11 పూర్తి సభ్య దేశాలు ఉన్నాయి. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ ఇందులో ఉన్నాయి. మరో 10 దేశాలు భాగస్వామ్య దేశాలుగా కొనసాగుతున్నాయి.
ఈ గిఫ్ట్ బ్యాగ్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది రకాల ఉత్పత్తులను ఉంచారు. ఎన్డీటీవీ జర్నలిస్ట్ సిమ్రిన్ గుప్తా ఈ బ్యాగ్ను అన్బాక్సింగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశారు. ‘లోకల్ ఉత్పత్తులకు భారత్ ప్రాధాన్యం ఇస్తోంది’ అంటూ ఆమె బ్యాగ్లో ఉన్న వస్తువులను చూపించారు.
బ్యాగ్లో బిహార్కు చెందిన సత్తు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేయించిన శనగలతో తయారు చేసే సత్తులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బిహార్లో ఎంతో ప్రసిద్ధి. భవిష్యత్తులో పాశ్చాత్య దేశాల్లోనూ సత్తు సూపర్ఫుడ్గా గుర్తింపు పొందొచ్చని గుప్తా పేర్కొన్నారు.
ఒడిశాలోని గిరిజన ప్రాంతాల్లో పండించే 100 శాతం అరబికా స్పెషాలిటీ కాఫీని కూడా బ్యాగ్లో ఉంచారు. దీనితో పాటు బిహార్ మఖానా కూడా ఉంది. భారత్లో ఎంతో ప్రాచుర్యం పొందిన స్నాక్గా మఖానాకు గుర్తింపు ఉంది.
గుజరాత్కు చెందిన బ్లాక్ ప్రింట్ కండువా కూడా ఈ గిఫ్ట్ బ్యాగ్లో ఉంది. వీటితో పాటు కాఫీ మగ్, టోట్ బ్యాగ్ను అందిస్తున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే.. టోట్ బ్యాగ్లోనే ఛార్జింగ్ పోర్ట్ను ఏర్పాటు చేశారు. దీంతో జర్నలిస్టులు ప్రయాణంలోనే తమ ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకోవచ్చు.
బ్రిక్స్ సదస్సు కోసం సుమారు 1,200 నుంచి 1,300 మంది జర్నలిస్టులు ఢిల్లీకి రానున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు. భారత్ మండపంలో ప్రత్యేక అంతర్జాతీయ మీడియా సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జర్నలిస్టులకు సమాచారం అందించడం, సదస్సు కార్యక్రమాల కవరేజీకి ఈ కేంద్రం ఉపయోగపడనుంది.
ప్రస్తుతం బ్రిక్స్లో 11 పూర్తి సభ్య దేశాలు ఉన్నాయి. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ ఇందులో ఉన్నాయి. మరో 10 దేశాలు భాగస్వామ్య దేశాలుగా కొనసాగుతున్నాయి.