బాలెన్ షా తొలి విదేశీ పర్యటన భారత్కే.. నేపాల్ కీలక ప్రకటన
- ఈ ఏడాది చివర్లో పర్యటనకు అవకాశం
- ఇంకా ఖరారు కాని తేదీలు
- నేపాల్ వాణిజ్యంలో 70 శాతం భారత్తోనే
- రూపాయి అనుసంధానంపై కొనసాగుతోన్న అధ్యయనం
- 100 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
నేపాల్ ప్రధాని బాలెన్ షా తొలి విదేశీ పర్యటన భారత్లోనే ఉండనుంది. ఈ ఏడాది చివర్లోగా భారత్కు వచ్చే అవకాశం ఉందని నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. కాఠ్మాండులో జరిగిన ఎన్డీటీవీ అన్విక్షా సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
బాలెన్ షా బాధ్యతలు చేపట్టిన తొలి 100 రోజులు దేశీయ అంశాలపైనే దృష్టి పెట్టారని వాగ్లే చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన 100 అంశాల కార్యాచరణలో 87.2 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పుడు విదేశీ పర్యటనలపై చర్చ మొదలైందన్నారు. తొలి పర్యటన భారత్కే ఉంటుందని స్పష్టం చేశారు.
బలెన్ షా భారత పర్యటన ప్రకటన ప్రాధాన్యం కలిగినదని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. భారత్-నేపాల్ సంబంధాలు ఎంతో బలమైనవని చెప్పారు. సరిహద్దులు, పాస్పోర్టులు ఈ బంధాన్ని విడదీయలేవని పేర్కొన్నారు.
భారత రూపాయితో నేపాల్ రూపాయి మారకం విలువ 1.6:1గా ఉంది. ఈ అనుసంధానాన్ని వెంటనే మార్చే ఆలోచన లేదని వాగ్లే తెలిపారు. దీనిపై అధ్యయనం మాత్రమే చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నేపాల్ వాణిజ్యంలో 70 శాతం భారత్తోనే జరుగుతోందని వెల్లడించారు.
నేపాల్ ఆర్థిక వ్యవస్థను వచ్చే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో 100 బిలియన్ డాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కనీసం 7 శాతం వృద్ధి అవసరమని వాగ్లే చెప్పారు. స్వచ్ఛ ఇంధనం, పర్యాటకం, తయారీ, అధిక విలువైన వ్యవసాయం, డిజిటలైజేషన్పై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.
బాలెన్ షా సంప్రదాయ రాజకీయ నేతలకు భిన్నంగా పనిచేస్తున్నారని వాగ్లే అన్నారు. ప్రసంగాల కంటే పనులు, ఫలితాలకే ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. నిర్ణయాల విషయంలో చట్టపరమైన అంశాలను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తారని తెలిపారు.
బాలెన్ షా బాధ్యతలు చేపట్టిన తొలి 100 రోజులు దేశీయ అంశాలపైనే దృష్టి పెట్టారని వాగ్లే చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన 100 అంశాల కార్యాచరణలో 87.2 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పుడు విదేశీ పర్యటనలపై చర్చ మొదలైందన్నారు. తొలి పర్యటన భారత్కే ఉంటుందని స్పష్టం చేశారు.
బలెన్ షా భారత పర్యటన ప్రకటన ప్రాధాన్యం కలిగినదని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. భారత్-నేపాల్ సంబంధాలు ఎంతో బలమైనవని చెప్పారు. సరిహద్దులు, పాస్పోర్టులు ఈ బంధాన్ని విడదీయలేవని పేర్కొన్నారు.
భారత రూపాయితో నేపాల్ రూపాయి మారకం విలువ 1.6:1గా ఉంది. ఈ అనుసంధానాన్ని వెంటనే మార్చే ఆలోచన లేదని వాగ్లే తెలిపారు. దీనిపై అధ్యయనం మాత్రమే చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నేపాల్ వాణిజ్యంలో 70 శాతం భారత్తోనే జరుగుతోందని వెల్లడించారు.
నేపాల్ ఆర్థిక వ్యవస్థను వచ్చే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో 100 బిలియన్ డాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కనీసం 7 శాతం వృద్ధి అవసరమని వాగ్లే చెప్పారు. స్వచ్ఛ ఇంధనం, పర్యాటకం, తయారీ, అధిక విలువైన వ్యవసాయం, డిజిటలైజేషన్పై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.
బాలెన్ షా సంప్రదాయ రాజకీయ నేతలకు భిన్నంగా పనిచేస్తున్నారని వాగ్లే అన్నారు. ప్రసంగాల కంటే పనులు, ఫలితాలకే ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. నిర్ణయాల విషయంలో చట్టపరమైన అంశాలను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తారని తెలిపారు.