సాఫ్ట్వేర్ రంగంలో లేఆఫ్స్ కల్లోలం.. 'వయసు తక్కువ' అని ఉద్యోగం నుంచి తొలగింపు!
- వయసు తక్కువగా ఉందని మైక్రోసాఫ్ట్ ఉద్యోగం నుంచి తీసేసిందన్న టెక్కీ
- కుటుంబానికి తానే ఏకైక ఆధారమని 'రెడ్డిట్'లో ఓ ఇంజినీర్ ఆవేదన
- భారత్లో 12,000 మంది ఉద్యోగులను తొలగించిన ఒరాకిల్
సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల తొలగింపు పరంపర కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ను మైక్రోసాఫ్ట్ సంస్థ విధుల్లో నుంచి తొలగించింది. తాను వయసులో చిన్నవాడినని, కుటుంబ బాధ్యతలు తక్కువగా ఉంటాయనే సాకుతో తనను తొలగించినట్లు సదరు ఇంజినీర్ 'రెడ్డిట్' వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. అతను ప్రస్తుతం కొత్త ఉద్యోగం వేటలో ఉన్నాడు.
సుమారు మూడేళ్ల అనుభవం ఉన్న ఆ యువకుడు, తన కుటుంబానికి తానే ఏకైక జీవనాధారమని తన పోస్ట్లో పేర్కొన్నారు. తల్లిదండ్రుల పోషణ, సోదరి చదువు, తండ్రి తీసుకున్న రుణాలను చెల్లించడం వంటి బాధ్యతలన్నీ తనపైనే ఉన్నాయని వివరించారు. అయితే, లేఆఫ్ గురించి చెప్పే సమయంలో తన మేనేజర్ కేవలం ఓదార్చడానికే ఆ కారణం చెప్పి ఉండవచ్చని, అసలు కారణం వేరే అయి ఉంటుందని అతను అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం 'ఒరాకిల్' ఇప్పటికే భారత్లో భారీగా ఉద్యోగ కోతలను చేపట్టినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 12,000 మంది ఉద్యోగులపై సంస్థ వేటు వేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 30,000 వరకు ఉంది. సంస్థాగత మార్పుల నేపథ్యంలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించాల్సి వస్తోందని, ఈ ప్రక్రియలో కొన్ని పోస్టులు అదనంగా మారుతున్నాయని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో ఒరాకిల్ పేర్కొంది.
విధుల్లో నుంచి తొలగించిన ఉద్యోగుల కోసం సంస్థ ఒక ప్యాకేజీని ప్రకటించింది. నోటీసు కాలానికి సంబంధించిన వేతనంతో పాటు, స్వచ్ఛందంగా రాజీనామా చేసేవారికి అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని వెల్లడించింది. అయితే, ఈ లేఆఫ్స్పై అధికారికంగా స్పందించేందుకు ఒరాకిల్ నిరాకరించింది.
సుమారు మూడేళ్ల అనుభవం ఉన్న ఆ యువకుడు, తన కుటుంబానికి తానే ఏకైక జీవనాధారమని తన పోస్ట్లో పేర్కొన్నారు. తల్లిదండ్రుల పోషణ, సోదరి చదువు, తండ్రి తీసుకున్న రుణాలను చెల్లించడం వంటి బాధ్యతలన్నీ తనపైనే ఉన్నాయని వివరించారు. అయితే, లేఆఫ్ గురించి చెప్పే సమయంలో తన మేనేజర్ కేవలం ఓదార్చడానికే ఆ కారణం చెప్పి ఉండవచ్చని, అసలు కారణం వేరే అయి ఉంటుందని అతను అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం 'ఒరాకిల్' ఇప్పటికే భారత్లో భారీగా ఉద్యోగ కోతలను చేపట్టినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 12,000 మంది ఉద్యోగులపై సంస్థ వేటు వేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 30,000 వరకు ఉంది. సంస్థాగత మార్పుల నేపథ్యంలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించాల్సి వస్తోందని, ఈ ప్రక్రియలో కొన్ని పోస్టులు అదనంగా మారుతున్నాయని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో ఒరాకిల్ పేర్కొంది.
విధుల్లో నుంచి తొలగించిన ఉద్యోగుల కోసం సంస్థ ఒక ప్యాకేజీని ప్రకటించింది. నోటీసు కాలానికి సంబంధించిన వేతనంతో పాటు, స్వచ్ఛందంగా రాజీనామా చేసేవారికి అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని వెల్లడించింది. అయితే, ఈ లేఆఫ్స్పై అధికారికంగా స్పందించేందుకు ఒరాకిల్ నిరాకరించింది.