నక్సలిజం అంతమైంది.. కానీ ‘దిమాగీ నక్సల్స్’ ఇంకా ఉన్నారు: మోదీ
- సాయుధ నక్సలిజం దాదాపుగా అంతమైందన్న మోదీ
- మావోయిస్టు భావజాలం ఇంకా కొనసాగుతోందని హెచ్చరిక
- ‘దిమాగీ నక్సల్స్’ను గుర్తించి ఒంటరి చేయాలని పిలుపు
- 2014లో నక్సలిజం నిర్మూలనకు నిర్ణయించామని వెల్లడి
- నక్సలిజం చివరి దశలో ఉందని ప్రధాని వ్యాఖ్య
దేశంలో సాయుధ నక్సలిజం, మావోయిస్టు హింసను దాదాపుగా అంతం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయితే మావోయిస్టు భావజాలం మాత్రం ఇంకా కొనసాగుతోందని హెచ్చరించారు. ఆ ఆలోచనా విధానంతో ఉన్న వారిని ‘దిమాగీ నక్సల్స్’గా పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, సమాజంలో హింస, అశాంతిని ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అడవుల్లో సాయుధ నక్సల్స్ను నిర్మూలించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రధాని చెప్పారు. దశాబ్దాలుగా దేశాన్ని వేధించిన ఈ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించామని అన్నారు. అయితే సాయుధ నక్సల్స్ అంతమైనా వారి భావజాలం పూర్తిగా అంతం కాలేదని పేర్కొన్నారు. మావోయిస్టు ఆలోచనా విధానం ఉన్న కొందరు సంస్థలు, వ్యవస్థల్లోకి చొరబడి ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేయాలని నిర్ణయించుకున్నామని మోదీ తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. యువత, కుటుంబాలు, భద్రతా బలగాలు ఈ హింసతో తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. తుపాకీ భయంతో ప్రజలను బందీలుగా మార్చిన పరిస్థితులు ఉండేవని, రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచేందుకు మావోయిస్టులు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రస్తుతం నక్సలిజం చివరి దశలో ఉందని, పూర్తిగా నిర్మూలించే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.
సాయుధ నక్సలిజంపై పోరాటంతోనే తమ పని పూర్తికాదని మోదీ స్పష్టం చేశారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు హింస, అరాచకాన్ని ప్రోత్సహించేందుకు వివిధ మార్గాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. సమాజాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించే ఇలాంటి వారిని గుర్తించి ఒంటరి చేయాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా నక్సలిజం నిర్మూలనను ప్రశంసించారు. దశాబ్దాలుగా దేశానికి తీవ్ర సవాలుగా ఉన్న నక్సలిజాన్ని అంతం చేయడం గొప్ప విజయమని అన్నారు. గతంలో నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని పేర్కొన్నారు. బస్తర్ ఒలింపిక్స్, బస్తర్ పండుగ వంటి కార్యక్రమాల్లో స్థానిక ప్రజల భాగస్వామ్యం పెరగడం మార్పునకు నిదర్శనమని తెలిపారు.
అడవుల్లో సాయుధ నక్సల్స్ను నిర్మూలించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రధాని చెప్పారు. దశాబ్దాలుగా దేశాన్ని వేధించిన ఈ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించామని అన్నారు. అయితే సాయుధ నక్సల్స్ అంతమైనా వారి భావజాలం పూర్తిగా అంతం కాలేదని పేర్కొన్నారు. మావోయిస్టు ఆలోచనా విధానం ఉన్న కొందరు సంస్థలు, వ్యవస్థల్లోకి చొరబడి ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేయాలని నిర్ణయించుకున్నామని మోదీ తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. యువత, కుటుంబాలు, భద్రతా బలగాలు ఈ హింసతో తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. తుపాకీ భయంతో ప్రజలను బందీలుగా మార్చిన పరిస్థితులు ఉండేవని, రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచేందుకు మావోయిస్టులు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రస్తుతం నక్సలిజం చివరి దశలో ఉందని, పూర్తిగా నిర్మూలించే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.
సాయుధ నక్సలిజంపై పోరాటంతోనే తమ పని పూర్తికాదని మోదీ స్పష్టం చేశారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు హింస, అరాచకాన్ని ప్రోత్సహించేందుకు వివిధ మార్గాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. సమాజాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించే ఇలాంటి వారిని గుర్తించి ఒంటరి చేయాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా నక్సలిజం నిర్మూలనను ప్రశంసించారు. దశాబ్దాలుగా దేశానికి తీవ్ర సవాలుగా ఉన్న నక్సలిజాన్ని అంతం చేయడం గొప్ప విజయమని అన్నారు. గతంలో నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని పేర్కొన్నారు. బస్తర్ ఒలింపిక్స్, బస్తర్ పండుగ వంటి కార్యక్రమాల్లో స్థానిక ప్రజల భాగస్వామ్యం పెరగడం మార్పునకు నిదర్శనమని తెలిపారు.