భర్త పైశాచికత్వం.. భార్యను చంపుతూ అత్తమామలకు వీడియో కాల్

Praveen Jigalur kills wife and makes video call to parents in law
  • కర్ణాటకలో భార్యను దారుణంగా హత్య చేసిన భర్త
  • చనిపోతున్న కూతురిని వీడియో కాల్‌లో తల్లిదండ్రులకు చూపించిన వైనం
  • వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఈ ఘాతుకం
  • పుట్టింటి నుంచి నమ్మించి తీసుకొచ్చిన రోజే హత్య
  • నిందితుడు ప్రవీణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
కర్ణాటకలో ఒక కిరాతక ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా, ఆమె ప్రాణాలు విడుస్తున్న దృశ్యాలను నిందితుడు వీడియో కాల్ ద్వారా అత్తమామలకు చూపించాడు. బాగల్‌కోట్ జిల్లాలో వెలుగుచూసిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

వివరాల్లోకి వెళితే, బిళగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గలగలి గ్రామానికి చెందిన ప్రవీణ్ జిగలూర్, భాగ్యశ్రీ (23) దంపతులు. భార్యపై అనుమానంతో ప్రవీణ్ తరచూ గొడవ పడేవాడు. భర్త వేధింపుల తాళలేక భాగ్యశ్రీ రెండు నెలల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, గతాన్ని మర్చిపోయి అన్యోన్యంగా ఉందామని నమ్మబలికిన ప్రవీణ్ ఆదివారం ఆమెను తిరిగి తన ఇంటికి తీసుకువచ్చాడు.

కానీ, ఇంటికి వచ్చిన అదే రోజు సాయంత్రం ఆమెపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా, ఆమె మరణిస్తున్న చివరి క్షణాలను మొబైల్‌లో రికార్డ్ చేయడమే కాకుండా, నేరుగా ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి చూపించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ వీడియోను మరికొందరికి కూడా షేర్ చేసినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కళ్ల ముందే కన్నకూతురు ప్రాణాలు విడుస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు అనుభవించిన ఆవేదన చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
Advertisement
Praveen Jigalur
Bagalkot Murder Case
Karnataka Crime News
Husband Kills Wife
Video Call Murder

More Telugu News