బలపడిన వాయుగుండం.. తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వానలు
- బంగాళాఖాతంలో వాయుగుండం
- చురుగ్గా మారిన నైరుతి రుతుపవనాలు
- వర్షాభావంతో ఉన్న రైతులకు ఊరట..సాగు పనులకు సన్నద్ధం
- జూరాలకు 24 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
- గోదావరిపై ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనివల్ల ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సంగారెడ్డిలో అత్యధికంగా 7.2 సెం.మీ., కామారెడ్డి జిల్లాలో 6.9 సెం.మీ., వికారాబాద్ జిల్లాలో 6.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. తాజాగా మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గింది. జూన్, జులై నెలల్లో కలిపి ఇప్పటివరకు 10 సెం.మీ. లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా దాదాపు 26 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. సోమవారం నాటికి జూరాల ప్రాజెక్టుకు 24,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. అయితే, శ్రీశైలం డ్యామ్కు కేవలం 163 క్యూసెక్కులు, నాగార్జునసాగర్కు 4,070 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే వస్తుండటం గమనార్హం. ఇక మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిపై ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 63,618 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది.
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. తాజాగా మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గింది. జూన్, జులై నెలల్లో కలిపి ఇప్పటివరకు 10 సెం.మీ. లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా దాదాపు 26 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. సోమవారం నాటికి జూరాల ప్రాజెక్టుకు 24,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. అయితే, శ్రీశైలం డ్యామ్కు కేవలం 163 క్యూసెక్కులు, నాగార్జునసాగర్కు 4,070 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే వస్తుండటం గమనార్హం. ఇక మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిపై ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 63,618 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది.