ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ చేరుకున్న భారత ప్రతినిధులు
- విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ హస్నైన్ నాయకత్వం
- టెహ్రాన్కు పలువురు మత పెద్దలు
- అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఖమేనీకి నివాళులు
వీరితో పాటు పలువురు మత పెద్దలు కూడా వ్యక్తిగత హోదాలో టెహ్రాన్కు చేరుకుని ఖమేనీ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, మతపెద్దలు టెహ్రాన్కు తరలివస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే.
ఐదు రోజుల పాటు కొనసాగే ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో లక్షలాది మంది అనుచరులు, విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ముప్పుపై ఐఆర్జీసీ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడితే సహించేది లేదని, గతంలో ఎన్నడూ చూడని రీతిలో తమ ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేసింది.